Don't Miss!
- News ఆన్లైన్లోనూ నామినేషన్లు దాఖలు.. తొలిరోజు తెలంగాణాలో దాఖలైన నామినేషన్లివే!!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభాస్ను కలిసిన దక్షిణాది స్టార్ డైరెక్టర్: ఆ ప్రాజెక్టుపై మరోసారి చర్చలు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేరిది. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న సినిమాలు మాత్రమే చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో బడా ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత తీసిన 'సాహో' కూడా కొన్ని వర్గాలను బాగా ఆకట్టుకుంది. దీంతో ప్రభాస్తో సినిమా చేయడానికి అన్ని ఇండస్ట్రీలకు చెందిన దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌతిండిన్ స్టార్ డైరెక్టర్ అతడిని కలిశాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది.
'KGF' అనే సినిమాతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో హీరో యశ్ క్యారెక్టర్ను ఎలివేట్ చేసి చూపించిన తీరుకు ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. దీనికితోడు ఈ సినిమాకు ఎన్నో అవార్డులు రావడంతో దేశ వ్యాప్తంగా ప్రశాంత్కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇంతటి పేరున్న దర్శకుడు తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ప్రభాస్తో ఓ ప్రాజెక్టు విషయమై మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై యంగ్ రెబెల్ స్టార్ కూడా సుముకంగా ఉన్నట్లు సమాచారం.
వాస్తవానికి ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అతడితో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కన్నడ డైరెక్టర్ ప్రభాస్ను కలవడం చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా ఉండగా, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'KGF Chapter 2' చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోనే జరుగుతోంది. సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో శ్రీనిధి హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేయబోతున్నారు.