Don't Miss!
- Sports ఐపీఎల్ లైవ్ ఫ్రీ.. ఒక్క RCB ఫ్యాన్స్కు తప్ప!
- Technology ఆపిల్ నుంచి త్వరలో ఏయే ఉత్పత్తులు లాంచ్ కానున్నాయో తెలుసా.. ఫోల్డబుల్ ఐఫోన్లు, ఐప్యాడ్లు సహా..!!
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- News ఎన్నికల వేళ సీఎం జగన్కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
- Finance Gold Rate: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్.. ఏకంగా రూ.4,600 పెరిగిన గోల్డ్.. ఒక్కరోజులోనే..
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జోష్.. ధనుష్తో కొత్త సినిమా!
'అ' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మంచి జోష్లో ఉన్నారు. మొదటి సినిమా 'అ' ద్వారానే ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటనేది తెలుగు సినిమా లోకానికి అర్థమైపోయింది. ఎంత లేట్ అయినా పర్వాలేదు గానీ సెలెక్టెడ్ సినిమాలు, విలక్షణమైన కథాంశాలు ఎన్నుకోవడమే లక్ష్యంగా ఈయన దూసుకుపోతున్నారు. ఈ కోవలోనే ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా 'కల్కి' సినిమా రూపొందిస్తున్నారు ప్రశాంత్ వర్మ. అయితే తాజా సమాచారం మేరకు ఆయన టాలెంట్ నచ్చి తమిళ స్టార్ హీరో ధనుష్ అతనితో సినిమా చేసేందుకు కమిట్ అయ్యారని తెలుస్తోంది.
ఈ మేరకు ధనుష్, ప్రశాంత్ వర్మ మధ్యలో సంప్రదింపులు కూడా జరిగాయని ఫిలిం నగర్ టాక్. 'కల్కి' సినిమా విడుదల కాగానే ధనుష్ తో కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టనున్నారట ప్రశాంత్ వర్మ. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుందని, దీని కోసం మునుపెన్నడూ చూడని డిఫెరెంట్ కథాంశంతో ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ రోల్ డిఫెరెంట్గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఆయన డైరెక్షన్లో రానున్న మూడో సినిమా ఇదే అవుతుంది.
ఇక ప్రశాంత్ వర్మ తాజా సినిమా 'కల్కి' విషయానికొస్తే.. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన అదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'కల్కి' అప్డేట్స్ అన్నీ కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పైగా ఈ చిత్రం ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ కంటే ఉత్కంఠగా ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పడంతో అంచానాలు రెట్టింపయ్యాయి.