Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇంట్రెస్టింగ్: బాలయ్య సినిమాలో ప్రెగ్నెంట్ హీరోయిన్
ప్రెగ్నెంట్ హీరోయిన్ సమీరా రెడ్డి ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మరో రెండు నెలల్లోనే రెండో బిడ్డకు తల్లికాబోతున్న ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫోజులిస్తూ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జనాల నోళ్ళలో బాగా నానుతున్న సమీరాకు సంబందించిన ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.
ఇటీవలే తన కుటుంబం, ఫ్రెండ్స్ అందరి మధ్య సీమంతం జరుపుకున్న సమీరా రెడ్డి.. మరో రెండు నెలల్లో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. పెళ్లి తర్వాత చాలాకాలం మీడియాకు దూరంగా ఉన్న ఈ భామ ఈ మధ్యకాలంలో మీడియాతో తరచుగా ఇంటరాక్ట్ అవుతోంది. రాజమండ్రిలో పుట్టి ముంబైలో పెరిగిన సమీరాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో ఓ మీడియా సమావేశంలో ఆమె.. తాను తిరిగి తెలుగు సినిమాల్లో నటించేందుకు సుముఖంగా ఉన్నానని తెలిపి ఆశ్చర్యపర్చింది.
తాజాగా అందిన సమాచారం మేరకు నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో సమీరా హీరోయిన్ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. బాలయ్య 105 గా తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సమీరా రెడ్డి హీరోయిన్గా నటించనుందని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని రెగ్యులర్ షూటింగ్కి రెడీ అయింది. సమీరాకేమో డెలివరీకి ఇంకా రెండు నెలల సమయం ఉంది. దీంతో ఇలాంటి తరుణంలో ఆమె బాలయ్య చెంత చేరి చిందులేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే బాలయ్య 105 లో హీరోయిన్స్గా మెహ్రీన్, తమన్నా, శ్రేయా, పాయల్ రాజ్పుత్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి, చూడాలి మరి చివరకు ఏ హీరోయిన్కి బాలయ్యతో చిందులేసే అవకాశం దక్కేనో!. ఇక ఈ సినిమాకు 'రూలర్' టైటిల్ ఫైనల్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.