Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రిన్స్ మహేష్ బాబు ‘స్టార్ నైట్ కు' రావట్లేదా?
వరద బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ ఈనెల 7న తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'స్పందన' కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. నిజానికి ఈనెల 5వ తేదీ నుంచి అనుష్క, మహేష్ జంటగా స్టార్ డైరెక్టర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అతిథి" తర్వాత మరో చిత్రం 'కిలాడీ' (టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) నవంబర్ మొదటి వారంలో షూటింగ్ రాజస్థాన్ లోని వికారాబాద్ లో జరుగవలసి ఉంది. అయితే 'స్టార్ నైట్' ప్రిపరేషన్లు, రిహార్సల్స్ దృష్ట్యా నిర్వాహక కమిటీ 5, 6,7 తేదీలను పరిశ్రమకు సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ రోజుల్లో షూటింగ్ ఎక్కడా జరగరాదని స్పష్టం చేసింది. దీంతో 'కిలాడీ' చిత్ర యూనిట్ 7వ తేదీ తర్వాతే రాజస్థాన్ చేరుకుని 9 నుంచి షూటింగ్ ప్రారంభిస్తుందని తెలుస్తోంది.
మహేష్ సైతం ప్రస్తుతం లండన్ లో ఉన్నారని తెలుస్తోంది. అక్కడ్నించి ఆయన ముంబై చేరుకుని నేరుగా రాజస్థాన్ వెళ్లి షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. దీంతో 'స్టార్ నైట్'లో మహేష్ పాల్గొనే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, నరేష్, అదిశేషగిరిరావు హాజరవుతారు.