Don't Miss!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- News వైసీపీకి షాక్.. పార్టీకు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Technology 8GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా, 6.67 అంగుళాల డిస్ప్లేతో Realme స్మార్ట్ఫోన్ విడుదల..తొలిసారిగా ఈ ఫీచర్లతో!
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్
ప్రిన్స్ మహేష్ బాబు ఎట్టకేలకు తన అభిమానులకు ఇచ్చిన మాట నిలుపుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏటా కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని గతంలో చెప్పిన మహేష్ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇటీవల జరిగిన థమ్స్ అప్ ప్రచార కార్యక్రమంలో మహేష్ ఇందుకు విచారం వ్యక్తం చేస్తూ ఇక నుంచి తన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పి అభిమానులకు ఊరట కలిగించారు. అందులో భాగంగానే తన తదుపరి చిత్రంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో పనిచేసేందుకు మహేష్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు టాలీవుడ్ వర్గాల తాజా వార్త.
దర్శకుడు శ్రీనువైట్ల 'ఢీ', 'రెడీ', 'కింగ్' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ కథానాయకుడుగా రూపొందుతున్న 'నమో వెంకటేశ' చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ సైతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'వరుడు' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ముందుగా అనుకున్న ప్రకారం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాలని మహేష్ అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల గౌతమ్ మీనన్ ఇప్పుడు నాగచైతన్య రెండో చిత్రానికి దర్శక పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 'వరుడు' తర్వాత శ్రీనువైట్లతో పనిచేసేందుకు మహేష్ ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది. మహేష్-వైట్ల కాంబినేషన్ చిత్రాన్ని ఓ అగ్రనిర్మాత ఒకరు నిర్మించనున్నారు. 2010 సంక్రాంతి కానుకగా మహేష్ 'వరుడు', శ్రీనువైట్ల 'నమో వెంకటేశా' రిలీజ్ కానున్నారు. ఆ వెనువెంటనే ఈ ఇద్దరి కాంబినేషన్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.