twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SSMB28: మహేశ్ బాబుకు విలన్‌గా హీరో కమ్ డైరెక్టర్.. అంటే త్రివిక్రమ్ ప్లాన్ అదేనా!

    |

    కొంత కాలంగా విజయాల పరంపరతో సుదీర్ఘమైన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫామ్‌తో కనిపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను' నుంచి మొదలుకొని వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో హ్యాట్రిక్‌ను కూడా అందుకున్నాడు. అలాగే మహేశ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసి హవాను చూపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అతడు 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం టార్గెట్‌కు దగ్గరగా వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద సెమీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.

    దేత్తడి హారిక అందాల ఆరబోత: బాడీ పార్టులన్నీ కనిపించేలా ఘోరంగా!దేత్తడి హారిక అందాల ఆరబోత: బాడీ పార్టులన్నీ కనిపించేలా ఘోరంగా!

    ఒక సినిమా పట్టాలపై ఉండగానే మరో దానిని లైన్‌లో పెట్టుకుంటూ వస్తున్న టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుండడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన వార్తలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ప్రారంభానికి ముందే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతోంది. ఫలితంగా అప్పుడే ఈ చిత్రంఅందరి దృష్టినీ ఆకర్షించిందని చెప్పుకోవచ్చు.

     Prithviraj Sukumaran Negative Role in Mahesh Babu Movie

    త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ బాబు చేయాల్సిన సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, సర్కారు వారి పాట షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుండడంతో ఇది పట్టాలెక్కలేదు. ఇంతలో ఇటీవలే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. ఆ తర్వాత అతడికి కరోనా సోకింది. దీంతో అతడి ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. ఇక, ఈ మూవీ అధికారికంగా ఇటీవలే మొదలైంది. కానీ, రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమాలో కాస్టింగ్ మీద ఫోకస్ చేశాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రానికి గానూ విలన్ పాత్రను పోషించే నటుడిని ఎంపిక చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

    లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!

    సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో మహేశ్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే నటీనటుల గురించి ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో విలన్ పాత్రకు మలయాళంలో స్టార్ హీరోగా, దర్శకుడిగా వెలుగొందుతూ సత్తా చాటుతోన్న పృథ్వీరాజ్ సుకుమారన్‌ను తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే అతడు స్టోరీ కూడా వినేశాడని, ఆ వెంటనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే కేరళకు పృథ్వీరాజ్‌ను తీసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో పూజా హెగ్డే, ప్రియాంక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు', 'అర్జునుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

    English summary
    Mahesh Babu Announce his 28 film with Trivikram Srinivas. Prithviraj Sukumaran to Play Negative Role in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X