SSMB 29 హీరోయిన్, విలన్ ఫిక్స్.. మహేష్ బాబు-రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదుగా..

SSMB 29: సూపర్ స్టార్ మ‌హేశ్‌బాబు - సెన్సెషనల్ డైరెక్టర్ రాజ‌మౌళి కాంబినేష‌న్ 'ఎస్ఎస్ఎంబి 29'(SSMB29) అనే సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినిమా ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్నారు. యాక్షన్‌ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ను ఆఫ్రికా అడ‌వుల్లో చేయబోతున్నారట. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటీ? మీరు కూడా ఓ లూక్కేయండి.

RRR లాంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం. మహేష్ - రాజమౌళి కాంబో సినిమాపై ఓ రేంజ్ లో ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు భారీ పూర్తి చేసారని తెలుస్తోంది. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు.

Priyanka Chopra And Prithviraj Sukumaran For Mahesh Babu Rajamouli combo movie SSMB 29

అలాగే.. ఈ మూవీ కోసం మహేష్ బాబు తన లుక్ ను మార్చుకోబోతున్నారు. చాలా డిఫెరెంట్ గా కనిపించబోతున్నారట. ఇందుకోసం ఆయన లాంగ్ హెయిర్.. లైట్ గా గడ్డం పెట్టినట్టు ఇటీవల కాలం ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.అలాగే.. ఈ మూవీ 18 శతాబ్దంలో జరిగే కథ అని, పీరియడ్ డ్రామా అని తెలుస్తోంది. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ అంటూ.. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ లీడ్ రోల్ లో నటించనున్నట్టు తెలుస్తోంది

Priyanka Chopra And Prithviraj Sukumaran For Mahesh Babu Rajamouli combo movie SSMB 29

ఈ గ్లోబల్ అడ్వెంచర్ త్రిల్లర్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరలవుతుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ నటి, ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), విలన్ గా మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ పృధ్వీరాజ్ సుకుమార‌న్‌ (Prithviraj Sukumaran)ల‌ను ఫిక్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన న్యూస్‌ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ గా మారుతున్నాయి.

Priyanka Chopra And Prithviraj Sukumaran For Mahesh Babu Rajamouli combo movie SSMB 29

ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. మూవీ మేకర్స్ ను అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్టులలో ఈ మూవీ ఇప్ప‌టికే గుర్తింపును ద‌క్కించుకోవ‌డం విశేషం. ఈ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. అడ్వేంచర్‌ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే.. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X