Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ప్రభాస్ సినిమాకు అడ్డుపడుతున్న అగ్ర నిర్మాత.. 500 కోట్ల ప్రాజెక్ట్ పై హై టెన్షన్?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా అనంతరం మళ్లీ ఆ రెంజ్ లో సక్సెస్ అందుకొకపోయినప్పటికీ ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. ఇక రాబోయే సినిమాలు మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతాయి అని అభిమానుల్లో అయితే ఒక నమ్మకం ఉంది. ఇక ఈ తరుణంలో ప్రభాస్ లైన్లో పెట్టిన ఒక సినిమాపై అగ్ర నిర్మాత తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా టాక్ వస్తుంది. ఎందుకంటే ప్రభాస్ తో ఆయన 500 కోట్ల ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అసలు ఆ నిర్మాత ఎందుకు సంతృప్తిగా లేరు అనే వివరాల్లోకి వెళితే..
అత్యధిక మార్కెట్
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్ నెంబర్ వన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ప్రభాస్ కు అగ్రదర్శక నిర్మాతల నుంచి కూడా ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. ఇక ప్రభాస్ కూడా విభిన్నమైన ప్రాజెక్టులను చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని డిజాస్టర్స్ ఎదురైనప్పటికీ కూడా ఆయన క్రేజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు అని తెలుస్తోంది.
భారీగా పారితోషికం
ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు కూడా 100 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో రెబల్ స్టార్ హోదా ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం ఎలాంటి సినిమా చేస్తున్న కూడా అందుకు తగ్గట్టుగానే పారితోషికం కూడా తీసుకుంటున్నాడు. కొన్ని ప్రాజెక్టులకైతే 130 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో కూడా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దారుణంగా నష్టాలు
అయితే ప్రభాస్ ఇటీవల మాత్రం ఇటీవల అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బాహుబలి సినిమా తర్వాత సాహో తప్పకుండా అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఆ సినిమా హిందీలో తప్ప ఎక్కడా కూడా పెట్టిన పెట్టుబడికి లాభాలను అందించలేకపోయింది. ఇక ఈ ఏడాది ఏంతో అంచనాలతో వచ్చిన రాధే శ్యామ్ అయితే ఎక్కడా కూడా లాభాలను అందించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దాదాపు 70 కోట్లకు పైగానే నష్టాలు కలుగజేసింది.
నిర్మాత అప్సెట్
అయితే ప్రభాస్ వరుస అపజయాలు ఆయన తదుపరి నిర్మాతలపై కొంత ఒత్తిడి కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ K నిర్మాత సి.అశ్వినిరత్ కూడా ప్రభాస్ తీస్తున్న సినిమాలపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మారుతీ దర్శకత్వంలో చేయబోయే సినిమాపై కూడా ఏమాత్రం సంతృప్తిగా లేరు అని ఆ సినిమా చేయవద్దు అని కూడా ప్రభాస్ తో మాట్లాడుతున్నట్లు సమాచారం.
ఆ సినిమా తేడా కొడితే..
ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో చాలా వేగంగా ఒక కమర్షియల్ హారర్ ఫిలిమ్ చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. అయితే ఓ వర్గం అభిమానులు మాత్రం ఆ సినిమా చేయవద్దు అనే కోరుకుంటున్నారు. పైగా మారుతి ప్రభాస్ కు తగ్గట్టుగా సినిమాను తీసుకురాగలడా అనేది మరొక పెద్ద సందేహం.
ఈ తరుణంలో అశ్వినీతత్ మాత్రం ప్రభాస్ అలాంటి చిన్న సినిమా చేసి తన మార్కెట్ ను తగ్గించుకోవద్దు అని ఆ సినిమా తేడా కొడితే తదుపరి సినిమాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది అని ముఖ్యంగా ప్రాజెక్టు కె బిజినెస్ పై కూడా ప్రభావం చూపెడుతుందని ఆయన తన సైడ్ నుంచి ఒక వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ప్రభాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.