Don't Miss!
- News వైసీపీ షాకయ్యే పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ.. ఈసీకి ఫిర్యాదు.. ఎందుకంటే..
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలసుబ్రమణ్యంపై బడా నిర్మాతల రుసరుస
ఇటీవల శ్రీరామ రాజ్యం 50 రోజుల వేడుక సందర్భంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రసంగిస్తూ....తెలుగులో రామానాయుడు లాంటి బడా నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు మాత్రమే తీస్తున్నారు. వాటితో పాటు శ్రీరామ రాజ్యం లాంటి మంచి సినిమాలు సంవత్సరానికి కనీసం ఒక్కటైనా తీయండి అంటూ ఉచిత సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ఇలాంటి సినిమాలు తీసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచండి అనే అర్థం వచ్చేలా బాలు స్పీచ్ ఇచ్చారు. బాలు అలా మాట్లాడటంతోనే రామానాయుడు, ఇతర నిర్మాతల మొహాలు ఎర్రబడ్డాయి.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం....బాలు వ్యాఖ్యలపై బడానిర్మాతలంతా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి సినిమాలకు యవత ఆదరణ లేనప్పుడు తెలిసి చేతులు కాల్చుకుంటామా?, మేం చేసేది వ్యాపారమే, బాలు లాంటి వారు మాటలు ఎన్నయినా మాట్లాడతారు. రెమ్యూనరేషన్ విషయంలో రూపాయి కూడా నష్టపోవడానికి ఇష్టపడని బాలసుబ్రమణ్యం ఊకదంపుడు ఉచిత సలహాలు ఎన్నయినా ఇస్తారు? ఆయన సొమ్మేంపోతోంది అంటూ నిర్మాతలు రుసరుసలాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.