twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పులి టాక్ తో సంబందం లేదు కలెక్షన్సే ముఖ్యం...

    By Sindhu
    |

    పులి సినిమాకలెక్షన్లు పుంజుకుంటాయని దర్శకుడు ఎస్ జె సూర్య అభిప్రాయం వ్యక్తం చేశారు. పులి సినిమా పై ఇండస్ట్రీలో డివైడ్ టాక్ వస్తుండటంతో ఆయన విలేకరులతో మాట్లాడారు. సినిమా అంటే డివైడట్ టాక్ అని అంటున్నారు. మొదట ఖుషీ, బద్రీ, పోకిరి లాంటి సినిమాలు ప్లాప్ టాక్ వచ్చింది. తరువాత ఆ సినిమాలు ఎంత హిట్ అనే విషయం మనకు తెలిసిందే. అదే విదంగా పులి సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చింది. అయితే ప్లాప్ అయివుంటే రెండో రోజు నుండి కలెక్షన్లు పడిపోతాయి. కాని పులి సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ విషయం సినిమా థియేటర్లలలో నేను స్వయంగా చూశాను అని ఎస్ జె సూర్య అన్నారు. నేను పులి సినిమా ప్రేక్షుల మద్యలో కుర్చుని చూశాను. అసినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులకు అందరూ చప్పట్లు కొడుతున్నారు. పులి సినిమాను కష్టపడి తీసినందుకు ఫలితం దక్కింది అని చెప్పారు. ఇదే సంద్బంలో పవన్ ఇంత సుదీర్ఘ ప్రంసంగాలు చెప్పడం అవసరమా అని విలేకరులు ప్రశ్నించారు. అందుకు సూర్యతనదైన శైలిలో సమాదానం ఇచ్చారు. ఇంతకు ముందు దేవుళ్లు, గాంధీ, అన్నాదురై లాంటి వారు ఇలాంటి ప్రంసంగాలు ఇచ్చారు. అప్పుడు మనం విన్నాం. వాటిని స్సూర్తిగా తీసుకున్నాం. సమాజంలో మార్పుతీసుకురావాలని ప్రయత్నించాం. ఒక్కరు మారినా మాకు సంతోషం అని అన్నారు. పవన్ సినిమా చూసి ఒక తెలుగు సినిమాను హాలీవుడ్ సినిమాలాగా తీశావు. నాలో వున్న నటనను రాబట్టుకున్నావు. ఇలాంటి మంచి సినిమాలు మరన్ని తీయాలని పవన్ కళ్యాణ్ అన్నారని ఎస్ జె సూర్యా అన్నారు. తెలంగాణ భాష అప్పుడప్పుడు రావడం సహజం. ఒక మనిషి తన సోంత భాషను గుర్తు పెట్టుకుని మాట్లాడటం సహజం. వారు ఎక్కడికి వెళ్ళినా సోంత భాష మాట్లాడటం మరవరు అని వివరించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X