Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అంటే మహేష్ తో లేనట్లా?
హైదరాబాద్ : మహేష్ బాబు, పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. దాంతో ఈ కాంబినేషన్ మరోసారి రెడీ అవ్వబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ తో పూరీ చేస్తున్న చిత్రం పూర్తవగానే ఈ చిత్రం మొదలవుతుందని అన్నారు. అయితే ఇప్పుడు మంచు విష్ణుతో ఓ తమిళ చిత్రం రీమేక్, రానా తో ఓ చిత్రం నిమిత్తం పూరీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే...స్పీడుగా సినిమాల్ని తెరకెక్కించడంలో దిట్ట.. పూరి జగన్నాథ్. ఒక సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమా గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. ఆయన ఎన్టీఆర్ హీరో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈలోగా రానా కోసం మరో కథ సిద్ధం చేస్తున్నారు. రానా, పూరిల కలయికలో 'నేను నా రాక్షసి' వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కలయిక పట్టాలెక్కబోతోందని సమాచారం.
తెలుగు, హిందీ భాషల్లో పూరి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, అందులో రానా హీరోగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. రానాకి హిందీలో మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు పూరి 'బుడ్డా బన్ గయా తేరా బాప్' చిత్రంతో బాలీవుడ్లో విజయం సాధించారు. అందుకే ఈ కలయికకు రంగం సిద్ధమైందన్నమాట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఈ ప్రాజెక్టు కనుక పట్టాలు ఎక్కితే ఇప్పట్లో మహేష్ తో చిత్రం లేనట్లే కదా.