Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పూరీ జగన్నాథ్ భార్యకు ఎంపీ టిక్కెట్?
త్వరలో పూరీ జగన్నాధ్ భార్య లావణ్యకు ను ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి దింపుతున్నారని,ఆమెను అనకాపల్లి ఎంపీ టిక్కెట్ అభ్యర్దిగా ప్రకటించనున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా వినపడుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ దినపత్రికల్లో సైతం కథనాలు రావటంతో ఇప్పుడు అవి జోరందుకున్నాయి. ఆమె వైసీపీ పార్టీ ద్వారా ఎన్నికల బరిలోకి దూకనున్నారని చెప్తున్నారు.
అనకాపల్లి లోక్సభా స్థానం పరిధిలో కాపు సామాజికవర్గ ఓటర్లు అధికం. దాంతో వైసీపీ తమ పార్టీ నేతల్లో ఆ వర్గం నుంచి అంత చరిష్మా ఉన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో కొత్త అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ భార్య లావణ్య కాపు వర్గానికి చెందినవారు కావడంతో ఆమెను రంగంలోకి దించితే బాగుంటుందని భావిస్తున్నారని చెప్తున్నారు. పూరీ జగన్నాధ్ కుటుంబానికి వైయస్ జగన్ కుటుంబానికి ఉన్న అనుభందంమే ఈ మేరకు నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందంటున్నారు.
పూరీ జగన్నాథ్ది కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి గ్రామం. పూరీ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ టీడీపీలో కోటవురట్ల మండలశాఖ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాతి కాలంలో ఆయన టీడీపీ నుంచి బయటకొచ్చి వైసీపీలో చేరారు. ఇక ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు కూడా వైఎస్ జగన్ ప్రత్యేకంగా పూరీ స్వగ్రామమైన బీకేపల్లి వెళ్లారు. తర్వాత పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ విజయలక్ష్మి, ఆమె కుమార్తె షర్మిల కూడా బీకే పల్లిలోని పూరీజగన్నాథ్ స్వగృహంలో రాత్రి బస చేశారు. హైదరాబాద్లో జరిగిన పూరీజగన్నాథ్ కుమార్తె ఓణీల ఉత్సవానికి జగన్ హాజరయ్యారు.
పూరీ సోదరుడు గణేశ్ కూడా కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లో జరుగుతున్న షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. అందువల్ల ఎలాగైనా పూరీ జగన్నాథ్ను ఒప్పించి ఆయన భార్య లావణ్యను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించడానికి వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వినికిడి.