twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పక్కా మాస్ కథ సిద్ధం చేస్తున్న పూరి జగన్నాథ్!

    |

    డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జోరు బాగా తగ్గింది. వరుస పరాజయాలలో ఉన్న పూరి తదుపరి చిత్రంతో మంచి విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్ తన తనయుడు హీరోగా తెరకెక్కించిన మెహబూబా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. తదుపరి చిత్రం కూడా ఆకాష్ తోనే ఉంటుందని పూరి ప్రకటించాడు.

    ఆ చిత్రానికి సంబందించిన కథని పూరి పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా మెహబూబా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సారి ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పక్కా మాస్ కథ సిద్ధం చేసినట్లు సమాచారం.

     Puri Jagannadh preparing mass story for his son

    హీరోయిన్ తో పాటు చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు పూరి త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పూరి మరి కొంత మంది స్టార్ హీరోలతో కూడా సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

    English summary
    Puri Jagannadh preparing mass story for his son. He will announce more details soon
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X