Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఓటీటీలోకి పూరీ జగన్నాథ్ సినిమా: భారీ ఆఫర్ రావడంతో ఒప్పుకోక తప్పలేదు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసింది. ఈ సినిమాతో నిర్మాతగానూ భారీ లాభాలను అందుకున్నాడు పూరీ. దీని తర్వాత తన కుమారుడు ఆకాశ్ పూరీతో 'రొమాంటిక్' అనే చిత్రాన్ని తీస్తున్నాడు. దీనిని పూరీ శిష్యుడు అనిల్ పాదూరి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కేతికా శర్మ హీరోయిన్గా చేస్తోంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది.
కొద్ది రోజుల క్రితం 'రొమాంటిక్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో ఆకాశ్.. హీరోయిన్ కేతిక శర్మ కౌగిలించుకుని ఉన్నారు. అయితే, హీరోయిన్ ఒంటిపై దుస్తులు లేకపోవడమే అసలు సమస్య. దీంతో ఈ పోస్టర్పై సోషల్ మీడియాతో పాటు చాలా మంది సామాన్యులు కూడా విమర్శల వర్షం కురిపించారు. అప్పట్లో ఈ పోస్టర్ వైరల్ అయింది. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'రొమాంటిక్'ను విడుదల చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 ముందుకొచ్చిందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో దీన్ని ఓటీటీలో విడుదల చేయడానికి పూరీ జగన్నాథ్ అండ్ కో సిద్ధమైందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడనుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, పూరీ ఆకాశ్ హీరోగా ఇప్పటికే పలు చిత్రాలు విడుదలయ్యాయి. అవేమీ హిట్ అవలేదు. దీంతో 'రొమాంటిక్' విషయంలో పూరీ జగన్నాథ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ సినిమా తెరకెక్కించే సమయంలో దగ్గరుండి పర్యవేక్షించాడు.