Don't Miss!
- Finance Rekha Jhunjhunwala: ఆ 5 కంపెనీల్లో షేర్లు అమ్మిన రేఖా జున్జున్వాలా.. టాటా స్టాక్స్ కూడా..
- News శ్రీరామ నవమి.. ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ
- Automobiles అప్రిలియా నుంచి 4 సూపర్ టూరర్ బైక్లు లాంచ్.. ఒక్కో బైక్లో ఎన్నో స్పెషాలిటీస్.!!
- Sports KKR vs RR: 12 నెలలుగా రిక్వెస్ట్ చేస్తున్నా.. అస్సలు వినడం లేదు: రోవ్మన్ పోవెల్
- Lifestyle వేసవిలో నిమ్మరసం లేదా కొబ్బరి బోండాం ఏది బెటర్? ఏది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
- Technology WhatsApp మరియు Instagram లో Meta Ai ని ఎలా ఉపయోగించాలి? స్టెప్ బై స్టెప్ గైడ్
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
ఆ సీక్వెల్ తో గోపీచంద్, పూరీ జగన్నాధ్ మరోసారి
గతంలో పూరీ జగన్నాధ్, గోపీచంద్ కాంబినేషన్ లో గోలీమార్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందే అవకాశం ఉన్నట్లు సమాచారం.గోలీమార్ ఫ్లాప్ కావటంతో ఈ సారి ఎలాగయినా గోపీచంద్ తో హిట్ కొట్టాలని పూరీ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే గోలీమార్ లా ఈ సారి సీరియస్ సబ్జెక్టు కాకుండా.. ఫన్ తో సాగిపోయే చిత్రాన్ని ప్లాన్ చేయనున్నారు. పూరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలించిన 'ఇడియట్'కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందే అవకాశం ఉందని తెలుస్తోంది. గోపీచంద్ బాడి లాంగ్వేజిని మార్చి పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ ని తీయనున్నాడని, ఈ మేరకు ఓ స్టోరీ లైన్ గోపీ కి చెప్పారని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇక గోపీచంద్ కూడా వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తన్న గోపీచంద్ ఆ తర్వాత యేలేటి చంద్రశేఖర్ దర్సకత్వంలో చేస్తారని వినపడింది. అయితే ఈలోగా పూరి ప్రాజెక్టు ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పూరీ అమితాబ్ ప్రధాన పాత్రలో బుడ్డా చిత్రం చేస్తున్నారు. అంతేగాకుండా తన తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా తీస్తున్న సినిమాకు పూరి సంగీతం కూడా అందిస్తున్నాడు. అలాగే రానా హీరోగా 'నేను నా రాక్షసి' రూపొందించాడు. ఆ చిత్రం ఇటీవలే ఆడియో విడుదల చేశారు.