పూరి జగన్నాథ్ నెక్ట్స్ నందమూరి హీరోతో..ఎన్టీఆర్ కాదు

ఇక ప్రస్తుతం నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హార్ట్ఎటాక్' చిత్రం ఫస్ట్లుక్ నిన్న విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ''ప్రస్తుతం గోవాలో షెడ్యూల్ జరుపుతున్నామని ఈ షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తి అవుతుందని చెప్పారు. ఇదొక ప్రేమకథ. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలోనే గీతాల్ని విడుదల చేస్తాము''అన్నారు.
ఒంట్లో మూడు వేల కేలరీల శక్తిని కరిగించుకొనేందు కోసం... ఒక గంటపాటు ముద్దు కావాలని అడిగాడు ఓ కుర్రాడు. మరి ఆ అమ్మాయి సమాధానమేమిటో మా చిత్రం చూస్తే తెలుస్తుందంటున్నారు పూరి జగన్నాథ్. ఆయన దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'హార్ట్ ఎటాక్'. నితిన్, అదాశర్మ జంటగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది.
నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. నితిన్ సరసన అదాశర్మ హీరోయిన్గా నటిస్తోంది ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: అమోల్ రాథోడ్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











