Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఫైనల్ గా పూరీ డైరక్ట్ చేయబోయే హీరో అతనే...
పూరీ జగన్నాధ్..బాలకృష్ణతో చేస్తున్నాడని, ఆ తర్వాత వెంకటేష్ తో చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఏవీ మెటీరియలైజ్ కాలేదు. కానీ ఇప్పుడు రాణా తో ఫైనల్ గా పూరీ జగన్నాద్ చిత్రం ఓకే అయినట్లు సమాచారం. నల్లమలపు బుజ్జి నిర్మాతగా రాణా హీరోగా ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక నల్లమలుపు బుజ్జి గత సంవత్సరకాలంగా మూడు నాలుగు ప్రాజెక్టులు మూవ్ చేద్దామని చూసారు. ఎన్టీఆర్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎమ్ ఎల్ ఎ చిత్రం, ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో గంగ..ది డాన్ చిత్రం, మొన్నటికి మొన్న సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రాణా హీరోగా చిత్రాలు ప్రారంభమవుతాయని అంతా అనుకున్నారు. దాని నిమిత్తం అడ్వాన్స్ లు,సిట్టింగ్ లు కూడా జరిగాయి. కానీ ఓకే కాలేదు. మొత్తానికి పూరీ...వెంకటేష్ కోసమని చెప్పిన కథ నచ్చి రాణా తో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు అయినా ఆగకుండా ముందుకెళ్తుందనీ ఆశిద్దాం.