Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పూరి ఓవర్ అవుతున్నాడా?
పూరి జగన్నాథ్ తన తాజా చిత్రం ఏక్ నిరంజన్ కి ఓవర్ బడ్జెట్ ఔతున్నాడని అంతటా వినపడుతోంది. ఎప్పుడు బడ్జెట్ లిమిట్ లోనే సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి ఇలా చేయటం అందర్ని విస్మయంకి గురి చేస్తోంది. దాంతో పోకిరి లాంటి హిట్ కే పన్నెడు కోట్ల లో సరిపోయింది..ఇదేంటి అని లెక్కలు వేస్తున్నారు.ఇంతకుముందు పూరి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా వచ్చిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రం ఫెయిల్యూర్ కావటంతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీస్తున్నట్లు వినపడుతోంది. అలాగే ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు బాలివుడ్ భామ కంగనా రౌనత్ ని పరిచయం పరిచయం చేస్తున్నారు.ఆమెరేమ్యునేషన్ కుడా బాగా ఎక్కువే అంటున్నారు.గతంలో సందడే సందడి వంటి చిత్రాలను నిర్మాత ఆదిత్యారామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాన్స్, యాక్షన్, కామిడి ప్రధానాంశాలుగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నానని పూరీ చెప్తున్నారు. కంగనా రౌనత్ కూడా తెలుగులో ఈ చిత్రం తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఆసిస్తోంది.అయితే బుజ్జిగాడు మేడిన్ చెన్నై ఫ్లాప్ కావటం, తమిళ్ బిళ్ళ రీమేక్ కూడా వర్క్ అవుట్ కాక పోవటం ట్రేడ్ లో ఈ చిత్రం మార్కెట్ పై పడే అవకాసముందని చెప్తున్నారు. పూరి ఎంతో హైప్ చేసి తీసిన నేనింతే కూడా దెబ్బ తెనటం కుడా లెక్క లోకి తీసుకోవాలని అంటున్నారు. అయితే గతం లో కూడా పూరి కి పడి లేవటం అలవాటే కాబట్టి మళ్ళి పోకిరి రేంజ్ హిట్ ఇస్తాడనే వారు ఉన్నారు.