సొంత ఇంటి మీద పూరీ జగన్ భారీ అప్పు
పూరీ జగన్నాధ్ హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిని ఐదు కోట్ల రూపాయలకు కుదవ పెట్టాడని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే అప్పులు ఎక్కువయ్యి ఈ పని చేసాడని కొందరంటూంటే అంత సీన్ లేదు కేవలం ఇనకంటాక్స్ బారి నుంచి తప్పించుకోవటానకి కొన్ని లెక్కలు సబ్మిట్ చేయటానికే ఈ పని చేసాడంటున్నారు. ఇక నేనింతే చిత్రంతో పూరీ బాగా నష్టపోయాడు కాబట్టి కుదవ పెట్టాడని కూడా అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే పూరీ ప్రస్తుతం గోపీచంద్ తో గోలీమార్ అనే చిత్రం చేస్తున్నారు. ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితచరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రియమణి ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఏక్ నిరంజన్ భాక్సాఫీస్ వద్ద కుప్పకూలటంతో ఈసారి తన శక్తి, యుక్తిలన్నిటినీ ఉపయోగించి హిట్ కొట్టాలనే తలంపుతో చేస్తున్నాడంటున్నారు.
More from Filmibeat
పూరీ జగన్నాధ్ పోకిరి గోలీమార్ ఏక్ నిరంజన్ ప్రభాస్ ప్రియమణి బద్రి నేనింతే రవితేజ puri jagannath pokiri golimaar ek niranjan prabhas priyamani nenithe ravi teja


Click it and Unblock the Notifications











