'పులి' తర్వాత పవన్.. పూరి దర్శకత్వంలో నే?

అలాగే గతంలో పవన్ కళ్యాణ్,రేణు దేశాయి కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ రూపొందించిన బద్రి సినిమా మంచి విజయం సాధించింది. అప్పటినుంచీ వేరే సినిమా వీరి కాంబినేషన్ లో రాలేదు. వీటికి సంభందించిన చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గణేష్ మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతోనే పవన్ ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపారని సమాచారం.
ఇక పూరీ జగన్నాధ్ ప్రస్తుతం నేనింతే షూటింగ్ లో బిజీ గా వున్నారు. దీని తర్వాత సాయిరాం శంకర్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఒక రకం గా చూస్తే పూరి జగన్నధ్ వరుస సినిమాలతో పూర్తి బిజిగా వున్నారు. మరి పవన్ చిత్రాన్ని ఎలా ప్లాన్ చేస్తారు అన్నది చూడాల్సిందే. అలాగే దశరధ్ తో ఇటీవల స్వాగతం చిత్రాన్ని నిర్మించిన ఆదిత్యరాం పూరి జగన్నధ్ తో టై అప్ అయ్యి దాదాపు వంద కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారనీ, వీరిద్దరు కలిసి వరుసగా సినిమాలు తీయనున్నరని కూడా తెలుస్తుంది. మరి వీటిలో జరిగేది ఏంటి అన్నిది వేచి చూడాల్సిన విషయం. ఏదైమైనా గణేష్ వంటి నటుడుని నిర్మాతగా మార్చి సినిమా తీయటమన్నది జరిగితే పవన్ సినిమాల్లో చెప్పే సిధ్ధాంతాలను నిజ జీవితంలోనూ అమలు పరుస్తున్నట్లే అని అందరూ అంటున్నారు.


Click it and Unblock the Notifications











