twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ, పవన్ కళ్యాణ్ చిత్రం ఆగటానికి కారణం?

    By Srikanya
    |

    పూరీ జగన్నాద్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో హాస్య నటుడు గణేష్ చిత్రాన్ని ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గణేష్ ..తాను హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నానని మీడీయాతో చెప్పారు. అయితే ఈ నిర్ణయం వెనక పవన్ ఆలోచన ఉందంటున్నారు. వరస పరాజయాలతో వెళ్థున్న పూరీకి తన ప్రాజెక్టును అప్పచెప్పటం ఎంత వరకూ సమంజసం అనే ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. అయితే అదేం కాదు..పూరీ తన మిత్రుడు హరీష్ శంకర్ కి ఈ చిత్రం డైరక్షన్ ఛాన్స్ ఇవ్వమని పవన్ కి చెప్పటంతో ఈ ప్రాజెక్టు మూవ్ అవుతోందని మరికొందరంటున్నారు. ఇంతకుముందు హరీష్ శంకర్ ..ఎన్టీఆర్ హీరోగా ఎమ్మల్యే అనే చిత్రాన్ని రూపొందిస్తారని,దానికి నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఉంటారని అన్నారు. అయితే ఎన్టీఆర్..శక్తి, బృందావనం చిత్రాల తర్వాత కానీ డేట్స్ సర్దుబాటు చేసే అవకాశం లేకపోవటంతో ఈ ప్రాజెక్టుకు హరీష్ శంకర్ మారాడంటున్నారు. ఇక షాక్ తర్వాత హరీష్ రూపొందిస్తున్న చిత్రం ఇదే. గణేష్ కూడా ఆంజనేయులు చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ రెండు చిత్రాల లోనూ రవితేజే హీరో. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న పులి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X