twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ చిత్రానికి టైటిల్ పెట్టే పనిలో పూరీ బిజీ

    By Srikanya
    |

    బాలకృష్ణ తను చేయబోయే చిత్రంకి టైటిల్ పెట్టే పనిలో పూరీ బిజీగా ఉన్నారు. ఆయన రెండు రోజుల క్రితం బాలకృష్ణకు తను అనుకున్న కథ వినిపించి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ఆయన కథ సరేగానీ దానికి తగ్గ ఫవర్ ఫుల్ టైటిల్ తో రమ్మని, దానిని లాంచింగ్ రోజున ప్రకటించాలని చెప్పినట్లు సమాచారం. దాంతో పూరీ తన టీమ్ తో ఆ పనిలో ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే బెల్లంకొండ నిర్మించే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా త్రిషని, సెకెండ్ హీరోయిన్ గా శ్వేతాబసుని ఎంపికచేసినట్లు సమాచారం.

    అలాంటి ఈ చిత్రం మే ఇరవైన లాంచ్ కానుందని సమాచారం. ఇంతకుముందు బాలయ్య హీరోగా 'చెన్నకేశవ రెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ తిరిగి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. బాలయ్యబాబు కెరీర్ ‌లోనే ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచేవిధంగా హై రేంజ్‌ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం..పూరి జగన్నాథ్, బాలయ్య బాబు కాంబినేషన్ అంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాటికి ధీటుగా ఈ చిత్రం సబ్జెక్ట్ ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. మరో ప్రక్క పూరీ జగన్నాధ్...తన లేటెస్ట్ చిత్రం గోలీమార్ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియమణి చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X