Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
BB3 నుంచి వాళ్లిద్దరూ ఔట్: మరోసారి ఆయననే తీసుకొచ్చిన బోయపాటి శ్రీను
'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. అందుకు అనుగుణంగానే చిత్రీకరణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. వాటిని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ లీకైంది.
బోయపాటి శ్రీను సినిమా అంటేనే ఊహకందని విధంగా యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. బాలయ్య ఇమేజ్కు సైతం అదే తరహాలో చేస్తేనే సెట్ అవుతాయి. కాబట్టి ఈ సినిమా ఫైట్స్ విషయంలో యూనిట్ ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే మొదట ఎంపిక చేసుకున్న స్టంట్ శివను తప్పించి.. రామ్ లక్ష్మణ్ మాస్టర్లను తీసుకున్నారు. వాళ్ల నేతృత్వంలోనే పలు ఫైట్లు కూడా చిత్రీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ఇద్దరు మాస్టర్లు కూడా సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తగిన కారణాలు తెలియలేదు కానీ, ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు, మరోసారి స్టంట్ శివనే తీసుకున్నట్లు కూడా తెలిసింది.
ఇక, బాలకృష్ణ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేస్తుండగా.. సామ్నా ఖాసీం అలియాస్ పూర్ణ మరో లీడ్గా చేస్తోంది. ఈ చిత్రానికి 'గాడ్ఫాదర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, ఇందులో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కీలక పాత్రను పోషిస్తుండగా.. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి విలన్గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. థమన్ సంగీతం సమకూర్చుతోన్న ఈ చిత్రం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.