Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్ కొత్త చిత్రం'రచ్చ' స్టోరీ ఫ్లోరైడ్ వాటర్ సమస్యతోనే
రామ్ చరణ్, తమన్నా కాంబినేషన్ లో సంపత్ నంది దర్సకత్వంలో రచ్చ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథాంశం ప్లోరైడ్ వాటర్ చుట్టూ తిరుగుతుందని ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. మే 2011లో మొదలయ్యే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న కథ ప్రకారం తెలంగాణాలో ఓ ప్రాతం ప్లోరైడ్ వాటర్ కి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడనుంచి వీడే చిత్రం టైపులో హీరో చేసే ప్రయత్నాలే కధాంశం అంటున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం చిరంజీవి ఎనభైల నాటి మాస్ సినిమాలా అలరిస్తుందంటున్నారు. ఇక ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన బాడీని సైతం తీర్చిదిద్దుకుని వచ్చి రెడీ అవుతున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆరెంజ్ ప్లాప్ నుంచి ఈ చిత్రం పూర్తిగా కోలుకునేలా చేస్తుందని రామ్ చరణ్ ఆశగా ఉన్నారు.