Don't Miss!
- News ఓటర్లను బెదిరించిన డీకేపై ఎఫ్ఐఆర్, అయ్యా అలా అనలేదని హైకోర్టులో పిటిషన్, అపార్ట్ మెంట్ లో ?
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రెట్రో సెట్స్పై ప్రభాస్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాహుబలి, సాహో లాంటి భారీ సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా జాన్( వర్కింగ్ టైటిల్). ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. సినిమాకు సంబంధించిన అన్ని అంశాలపై ఫోకస్ పెడుతూ ముందుకెళ్తున్నారు. ఇటీవలే వచ్చిన తన 'సాహో' మూవీ ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో ఈ సినిమాతో ఆ లోటు పూడ్చుకోవాలని అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు.
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సాహోతో పాటే కొంత షూటింగ్ను కూడా పూర్తి చేసుకుంది. ఈ మధ్యలో విడుదల కారణంగా ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ ఇచ్చారు మేకర్స్. ఇక ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. తాజా సమాచారం మేరకు నవంబర్ 19 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెట్రో సెట్ను సిద్ధం చేశాడట. 1980 బ్యాక్డ్రాప్లోసాగే ఈ రొమాంటిక్ డ్రామా కోసం యూరప్ లోని వీధులను ఈ సెట్లోకి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ సెట్స్ పై చిత్రంలోని పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోషించే రోల్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలిసింది. హస్త సాముద్రికం తెలిసిన వ్యక్తిగా ప్రభాస్ కనిపించనున్నాడని లేటెస్ట్ సమాచారం.
యూవీ క్రియేషన్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు సాహో సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన గిభ్రాన్ సంగీతం సమకూర్చుతున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.