twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెట్రో సెట్స్‌పై ప్రభాస్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

    |

    బాహుబలి, సాహో లాంటి భారీ సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా జాన్( వర్కింగ్ టైటిల్). ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. సినిమాకు సంబంధించిన అన్ని అంశాలపై ఫోకస్ పెడుతూ ముందుకెళ్తున్నారు. ఇటీవలే వచ్చిన తన 'సాహో' మూవీ ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో ఈ సినిమాతో ఆ లోటు పూడ్చుకోవాలని అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు.

    'జిల్‌' ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సాహోతో పాటే కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ మ‌ధ్యలో విడుద‌ల‌ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు మేకర్స్. ఇక ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. తాజా స‌మాచారం మేర‌కు న‌వంబ‌ర్ 19 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

     Radha Krishna Kumar- Prabhas shooting update

    ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ రెట్రో సెట్‌ను సిద్ధం చేశాడ‌ట‌. 1980 బ్యాక్‌డ్రాప్‌లోసాగే ఈ రొమాంటిక్ డ్రామా కోసం యూర‌ప్‌ లోని వీధుల‌ను ఈ సెట్‌లోకి తీసుకొచ్చార‌ని తెలుస్తోంది. ఈ సెట్స్ పై చిత్రంలోని పలు కీల‌క స‌న్నివేశాల‌ చిత్రీకరణ జరగనుంది. ఇక ఈ చిత్రంలో ప్ర‌భాస్ పోషించే రోల్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెలిసింది. హ‌స్త సాముద్రికం తెలిసిన వ్య‌క్తిగా ప్రభాస్ కనిపించనున్నాడని లేటెస్ట్ సమాచారం.

    యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సాహో సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన గిభ్రాన్ సంగీతం సమకూర్చుతున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

    English summary
    Prabhas recent release Saaho, directed by Sujeeth, failed to live up to everyone's expectation. After Saaho, the actor is now concentrating on his upcoming film titled Jaan. In this movie Prabhas playing interesting role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X