Don't Miss!
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ సినిమాలో 'లెజండ్' హీరోయిన్
హైదరాబాద్: బాలకృష్ణ లెజండ్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఎవరూ అంటే రాధిక ఆప్టే అని చెప్పాలి. ఆమెకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ మైగాడ్ రీమేక్ లో ఆఫర్ లభించిందని సమాచారం. వెంకటేష్ సరసన ఆమెను ఎంపిక చేసారని తెలుస్తోంది. మొదట నయనతారను అనుకున్నా ఆమె రెమ్యునేషన్ సమస్యతో డేట్స్ ఇవ్వకపోవటంతో రాధిక ఆప్టేని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆమె సైతం హోమ్లీ లుక్ తో లెజండ్ లో మెరవటంతో తమ చిత్రంలో పాత్రకు సూట్ అవుతుందని సురేష్ బాబు భావించే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఓ మైగాడ్ లో హీరోయిన్ కి అంత ప్రాధాన్యత ఉండేటంత సీన్ లేదు. కానీ దర్శకుడు దాని నిడివి పెంచి తెలుగుకి అణుగుణంగా తయారు చేసాడంటున్నారు. కిషోర్కుమార్(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్బాబు, శరత్మరార్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రంలో పవన్కల్యాణ్ ప్రత్యేక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ సూపర్ హిట్ 'ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ ఓ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. అయితే పవన్ స్వయంగా పార్టీ పెట్టి ప్రచారంకి వెళ్తూన్న నేపధ్యంలో ఈ చిత్రం ఉంటుందా..ఉండదా..వేరే హీరో వచ్చి పవన్ ప్లేస్ ని రీ ప్లేస్ చేస్తాడా అనే ఊహాగానాలు అంతటా వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్ పై పవన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. మే నెల రెండో వారం నుంచీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాసం ఉంది. అప్పటికి ఎలక్షన్స్ ముగియనుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.