ఉదయభానుపై మోజుని డైరక్ట్ గానే ఆ మ్యూజిక్ డైరక్టర్
టీవీ స్టార్ ఉదయభానుపై ఆ మ్యూజిక్ డైరక్టర్ కి విపరీతమైన మోజు ఉన్నట్లుంది.ఆ విషయం రీసెంట్ గా జరిగిన జెమనీ వారి పోగ్రాం నువ్వు నేను లో డైరక్ట్ గా బయిటపెట్టాడు. ఆ దర్సకుడు మరెవరో కాదు రఘు కుంచె.బంపర్ ఆఫర్,అహనా పెళ్ళంట చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న రఘు కుంచె ఈ పోగ్రామ్ లో పాల్గొని తన మనస్సులో ని క్రష్ ని బయిటపెట్టాడు. ఆ పోగ్రామ్ కి యాంకర్ గా చేస్తున్న ఉదయభాను గెస్ట్ గా వచ్చిన అతన్ని ఓ పాట పాడమని అడిగింది.రఘు వెంటనే ఆమెను ఉద్దేశించి పాట ఎత్తుకున్నాడు. అంతేకాదు పాటలో డాన్స్ చేస్తూ ఆమె చెయ్యని పట్టుకునే ప్రయత్నం చేసాడు. ఆ తర్వాత ఆమెను ఉద్దేశిస్తూ ఆమె ప్రక్కన ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందంటూ మాట్లాడాడు.లైవ్ షో లో రఘు కుంచె చేసిన ఈ ప్రేమ వ్యవహారానకి అందరూ కొంచెం ఆశ్చర్యపోయారు. మరికొందరు పోగ్రాం రక్తి కట్టించటానకి అతను చేసిన ప్లేగా భావించారు.ఇక ఈ పోగ్రాంలో రఘు కుంచె మొత్తం లక్ష రూపాయలు గెలుచుకున్నాడు.


Click it and Unblock the Notifications











