Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
రీమేక్ లో....మంచు విష్ణు, రాజ్ తరుణ్
హైదరాబాద్: ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హిట్ హీరోగా మారిన రాజ్ తరుణ్ కి వరస ఆఫర్స్ చుట్టముడుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ నిర్మిస్తున్న కుమారి 21ఎఫ్ లో చేస్తున్న రాజ్ తరుణ్ ...చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి సెట్స్ మీద ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ ను అంగీకరించాడు .
మంచు విష్ణు హీరోగా చేయనున్న ఓ సినిమాలో రాజ్ తరుణ్ ను మరో హీరోగా ఎంపిక చేశారని ఫిల్మ్ నగర్ సమాచారం. పంజాబీలో సూపర్ హిట్ అయిన ఓ కామెడీ చిత్రం రీమేక్ లో వీరిద్దరూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను చాలా కాలం క్రితమే తీసుకున్నాడు మంచు విష్ణు. అయితే అప్పటినుంచి ఈ సినిమా వాయిదా అవుతూ వస్తోంది.
తాజాగా ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు విష్ణు. విష్ణు తో గతంలో దేనికైనా రెడీ సినిమాను డైరెక్ట్ చేసిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు హీరోలు ఉండే ఈ సినిమా కోసం విష్ణుతో పాటు రాజ్ తరుణ్ ను మరో హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు.
ప్రస్తుతం సుశాంత్ హీరోగా ఆటాడుకుందాం రా సినిమాను తెరకెక్కిస్తున్న నాగేశ్వరరెడ్డి. ఆ సినిమా పూర్తయిన తరువాత విష్ణు, రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా పని మొదలెట్టనున్నాడు.