Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్తో ప్రభాస్.. పూరి, కొరటాల శిష్యులు కూడా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇక తీరిక ఉండదేమో. బాహుబలి లాంటి క్రేజీ చిత్రం ముగిసిందనుకుంటే వెంటనే సాహో చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే రాధాకృష్ణ దర్శత్వంలో మరో చిత్రం ప్రారంభమైంది. ఇప్పుడు మరో చిత్రానికి ఒకే చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. సాహూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది యువ దర్శకుడు సుజిత్. ఇక రాధాకృష్ణకు కూడా అంతగా ఫేమ్ లేదు. ఎక్కువగా యువదర్శకులతో సినిమా చేసేందుకు ప్రభాస్ ఆసక్తి చూపుతున్నాడట.
రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్
ఇటీవ ప్రభాస్ ఎక్కువగా డెబ్యూ దర్శకులు చెబుతున్నకథలు వినియాడానికి ప్రభాస్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణ అనే దర్శకుడు ఓ ఆసక్తికరమైన సబ్జెక్టుని ప్రభాస్ కు వివరించాడట. ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్ నిర్మాతలని కూడా ఈ కథ ఆకర్షించినట్లు తెలుస్తోంది. కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ చిత్రానికి ఓకె చెప్పడానికి ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడు.
కొరటాల, పూరి శిష్యులు కూడా
ప్రభాస్ యువ దర్శకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండడంతో స్టార్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్స్ గా పనిచేసిన వాళ్లంతా ప్రభాస్ ని కలిసేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ, పూరి జగన్నాథ్ లాంటి స్టార్ దర్శకుల శిష్యులు ప్రస్తుతం ప్రభాస్ ని మెప్పించే పనిలో ఉన్నారు.
కెజిఎఫ్ దర్శకుడు
బాహుబలి తర్వాత ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. దీనితో సహజంగానే పరభాషా దర్శకుల ద్రుష్టి కూడా ప్రభాస్ పై ఉంటింది. ఇటీవల కెజిఎఫ్ సంచలనం సృష్టించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ అవకాశం ఇస్తే ఓ పవర్ ఫుల్ మూవీ చేయాలని భావిస్తున్నాడు. కెజిఎఫ్ చిత్రాన్ని కన్నడ బాహుబలి అని అంతా ప్రశంసించారు. హీరో యష్ ని ప్రశాంత్ నీల్ ఒక రేంజ్ లో చూపించాడు. అలాంటి స్టోరీ ప్రభాస్ కు పడితే రికార్డులు తిరగరాసే చిత్రం అవుతుంది.
సాహోతో త్వరలో
బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. దీనితో ప్రభాస్ అభిమానులని సంతృప్తి పరిచేందుకు వరుస చిత్రాలతో రాబోతున్నాడు. ముందుగా సాహో చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. ఇక రాధాకృష దర్శత్వంలోని చిత్రం కూడా ఈ ఏడాది చివరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.