Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజమౌళి...బాలకృష్ణ కాంబినేషన్ డిటేల్స్
సింహా విజయంతో ఉషారుగా ఉన్న బాలయ్యతో ఇప్పుడు తెలుగులోని టాప్ డైరక్టర్స్ అంతా ఆసక్తి చూపుతున్నారనే సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి,బాలకృష్ణ కాంబినేషన్లో ఎ టీవీ ఛానెల్ వారు ఓ చిత్రం చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎంత బడ్జెట్ అయినా సింహాద్రి లాంటి హిట్ బాలకృష్ణతో కొట్టాలని వారు రాజమౌళిని సంప్రదించినట్లు వినిపిస్తోంది. అయితే రాజమౌళి ఓకే చేసారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఇక ఎ టీవీ వారు ఇంతుకుముందు వెంకటేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో నమో వెంకటేశ, వీరూ పోట్ల దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా బిందాస్ చిత్రాలు రూపొందించారు. అయితే ఈ రెండు చిత్రాలు ఊహించిన విధంగా హిట్టయి లాభాలు తేలేకపోయాయి. దాంతో వారు రాజమౌళి, బాలకృష్ణల క్రేజీ కాంబినేషన్ ని క్యాష్ చేసుకోదలిచారు. ఇక మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వారు ఓ చిత్రం ప్లాన్ చేసారు. అలాగే అల్లరి నరేష్ హీరోగా ముళ్ళపూడి వీర భద్ర చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలోనే ప్రారంభించనున్నారు. మగధీర అనంతరం రాజమౌళి..హాస్య నటుడు సునీల్ హీరోగా మర్యాద రామన్న చిత్రం చేస్తున్నారు. సలోని ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.