Don't Miss!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
రాజమౌళి మోసం చేసాడంటూ ‘బాహుబలి’ ఆర్ట్ డైరెక్టర్ ఆవేదన
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మీద, బాహుబలి టీం మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో సినిమా సూపర్ అంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పనితీరు అద్భుతం అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే బాహుబలి సినిమాకు పని చేసిన మరో ఆర్ట్ డైరెక్టర్ మను జగద్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రాజమౌళి, బాహుబలి టీం తనను మోసం చేసినట్లు ఆయన ఫీలవుతున్నారట. తనకు కనీసం టైటిల్ క్రెడిట్ ఇవ్వక పోవడంపై ఆవేదన చెందుతున్నాడని తెలుస్తోంది.
బాహుబలి సినిమాలో విజువల్స్ అంత గొప్పగా వచ్చాయంటే అందుకు కారణం సినిమాకు ఆర్ట్ డైరెక్టర్లు వేసిన స్కెచ్చులే. ఆ స్కెచ్చులకు విజువల్ ఎపెక్ట్స్ జోడించి తెరపై అద్భుతాలను చూపించారు. సినిమా విడుదలకు ముందు సదరు స్కెచ్చులు ఇంటర్నెట్లో అందరినీ ఆశ్యర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.
బాహుబలి సినిమాకు అసలైన ఆర్ట్ డైరెక్టర్ తానేనని, బాహుబలి సినిమా కోసం వేసిన స్కెచ్చుల్లో అధిక శాతం తాను వేసినవే అని, సాబు సిరిల్ కేవలం ఆర్ట్ డిపార్టుమెంట్ను కంట్రోల్ చేసే బాధ్యలు చూసుకున్నారు. సినిమా ప్రమోషన్ల సమయంలో కూడా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. కనీసం నాకు టైటిల్ క్రెడిట్స్ కూడా ఇవ్వడపోవడం దారుణం. నేనే మోసపోయాను అంటూ మను జగధ్ వాపోయినట్లు సమాచారం. మరి ఇతని వ్యాఖ్యలపై రాజమౌళి ఎల స్పందిస్తారో చూడాలి.