Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఖాలీగా ఉండటమెందుకుని రాజమౌళి ఘోస్ట్ డైరక్షన్
రాజమౌళి తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న రాజన్న చిత్రానికి ఘోస్ట్ డైరక్షన్ చేస్తున్నాడంటూ అంతటా వినపడుతోంది. మర్యాద రామన్న చిత్రం తర్వాత ఏ ప్రాజెక్టూ మొబలైజ్ చేయని రాజమౌళి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్ నాగార్జున హీరోగా రాజన్న అనే చిత్రం ఓకే చేయించుకున్నారు. అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ చిత్రం కమిటవ్వటానికి నాగార్జున ఒక కండిషన్ పెట్టారు. అది యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి చిత్రీకరించాలని. అలాగే అని ఓకే చేసిన రాజమౌళి ప్రస్తుతం టెక్నికల్ గా తన తండ్రి చిత్రాన్ని పర్యవేక్షిస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం చారిత్రక నేపధ్యంలో జరుగుతుంది. నాగార్జున సెకెండాఫ్ లో కనిపించే ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు. తెలంగాణ నేఫద్యంలో పీరియాడిక్ గా ఈ ఎపిసోడ్ ఉంటుంది. కథ రజాకార్ల ఉద్యమం(1945-55) నేఫద్యంలో జరగుతుంది. నాగార్జున సరసన స్నేహ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రంలో నాగార్జున పూర్తి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూంటారు.