Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్.. రాజమౌళి తనయుడికి కీలక బాధ్యతలు!
Recommended Video
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే రాజమౌళి ఈ చిత్రానికి సంబందించిన పనులని రాజమౌళి ప్రారంభించేశాడు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. తాజగా ఈ చిత్రం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
నటీనటుల ఎంపిక
రాజమౌళి తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి ట్రిపుల్ ఆర్ అని పిలుస్తున్నారు. ఈ చిత్ర నటీనటుల ఎంపిక ప్రారంభమైంది. ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రల గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హీరోయిన్లు, ఇతర ప్రధాన తారాగణం విషయంలో రాజమౌళి ఓ అంచనాలు వచేశారట.
తనయుడికి
రాజమౌళి ఏ చిత్రాన్ని తెరకెక్కించిన అతడి కుటుంబం మొత్తం కలసి కట్టుగా ఆ పనిచేస్తుంది. ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి కొందరి నటుల ఎంపిక ప్రక్రియని రాజమౌళి తన తనయుడు కార్తికేయపై అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. కేరళకు నటుల్ని ఎంపిక చేయడానికి కార్తికేయ మలయాళీ గడ్డపై అడుగుపెట్టాడట. దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
300 కోట్ల బడ్జెట్
బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి మార్కెట్ కు పరిథి లేదా అన్నట్లుగా అతడి ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. ట్రిపుల్ ఆర్ చిత్రానికి కూడా కేరళనుంచి జూనియర్ ఆర్టిస్టులని, నటుల్ని దించుతున్నారంటే ఈ చిత్రం ఎంతభారీగా తెరకెక్కబోతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ చిత్రానికి 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు.
నవంబర్ నుంచి
అంత్యంత ఆసక్తి రేపుతున్న ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రం నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.