Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
జూ ఎన్టీఆర్ తో రిస్క్ చేయలేను రాజమౌళి, సైడైపోయిన వివి వినాయక్....
'పాతాళ భైరవి" సినిమా గురించి జూ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చాలా రకాలుగా వ్యాఖ్యానించాడు. ఆ సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని జూ ఎన్టీఆర్, ఆ సినిమా కోసం దర్శకుడిగా రాజమౌళి, వివి వినాయక్ పేర్లను చాలా సార్లు విన్పించాడు. అయితే, ఈ మధ్య జూ ఎన్టీఆర్ ఎక్కడా 'పాతాళభైరవి" సినిమా గురించి మాట్లాడ్డంలేదు. అటు వివి వినాయక్, రాజమౌళి సైతం, 'పాతాళ భైరవి" ప్రస్తావన ఎక్కడి తీసుకురాకుండా జాగ్రత్తపడ్తున్నారు.
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతోనే ఇటు జూ ఎన్టీఆర్, అటు రాజమౌళి ఇంకోపక్క వివి వినాయక్..ఈ ముగ్గురూ 'పాతాళ భైరవి" సినిమా విషయంలో సైలెంట్ గా వున్నట్టు సమాచారం. ఇదిలా వుంటే, ఈ ఏడాదిలోనే జూ ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో 'పాతాళ భైరవి" సెట్స్ మీదకు వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. రాజమౌళి మాత్రం ప్రస్తుతానికైతే రిస్క్ చేయలేమని, కొద్ది నెలలు ఆగితే, పరిస్థితి కొలిక్కి వస్తుందనీ, అప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయమై ఆలోచిద్దామని, జూ ఎన్టీఆర్ బుజ్జగించినట్టు తెలుస్తోంది. అలనాటి మేటి చిత్రాలపై కొత్త తరం హీరోలు మోజు చూపుతున్న దరిమిలా, ముందు ముందు ఆ సినిమాలు మెరుగులు దిద్దుకుంటాయనీ, కొత్త తరం, ప్రేక్షకుల్ని రంజింపజేస్తాయనీ ఆశిద్దాం.