Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
తమిళ రీమేక్ లో రాజేంద్రప్రసాద్
హైదరాబాద్ : ఆ నలుగురు చిత్రంతో మళ్లీ పామ్ లోకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత మీ శ్రేయాభిలాషి మినహా చెప్పుకోతగ్గ పాత్ర చేయలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా జులాయి, మొగుడు వంటి చిత్రాల్లో చేసినా ఆయన ఇండిడ్యువల్ గా చేసి మెప్పించే పాత్ర పడలేదు. ఇప్పుడు ఓ తమిళ రీమేక్ లో ఆయనకు అలాంటి పాత్ర దొరికిందని తెలుస్తోంది. తమిళంలో నాజర్ చేసిన పాత్రను రాజేంద్రప్రసాద్ చేస్తున్నారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే..
తెలుగులో ఉన్న ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్ లో ఒకటైన ఉషాకిరణ్ మూవిస్ దర్శకుడు క్రిష్ కలిసి నిర్మాతగా ఓ చితం నిర్మిస్తున్నారు. రామోజీరావు గారు నిర్మించే ఈ చిత్రం ఓ తమిళ రీమేక్ అని సమాచారం. తమిళంలో నాన్న డైరక్టర్ విజయ్ రూపొందించిన ‘శైవం'కి ఇది రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రం చూసిన క్రిష్...బాగా నచ్చి రామోజీరావు గారికి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. రామోజీరావు గారు సైతం ఈ చిత్రం చూసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో కీలకమైన పాత్రకు రాజేంద్రప్రసాద్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేదు.
'నాన్న' చిత్రంలో ఆత్మీయ నటనను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్న సారా గుర్తుందిగా?.. ఆమె ప్రధాన పాత్రలో 'తలైవా' ఫేం ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శైవం'. తమిళంలో ఆ మధ్యన విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి కితాబు అందుకుంది. ఇందులో సారా నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేసారు. విజయ్ కూడా మంచి విజయం దక్కిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తెలుగు వెర్షన్ లో కూడా ఆమెనే తీసుకునే అవకాసం ఉంది. తాత, మనవరాలి మధ్య ఉన్న బంధం నేపథ్యంలో 'శైవం' తెరకెక్కించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేవలం ఓ కోడిపుంజు వేసి వదిలి, అందరినీ ఆశ్చర్యంలో పడేసారు.
ఇందులో 'దైవతిరుమగల్' ఫేం బేబీ సారా నటించటం ప్లస్ అయ్యింది. నాజర్ ముఖ్యపాత్ర పోషించారు. నాజర్ కుమారుడు బాషా కూడా ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు. 'శైవం' చిత్రాన్ని చూసిన రెడ్ జెయింట్ మూవీస్ బ్యానరు నిర్మాత, నటుడు ఉదయనిధి.. ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకొచ్చారు.
క్రిష్ విషయానికి వస్తే...
గతంలో క్రిష్...కంటెంట్ నే నమ్ముకుని గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం చిత్రాలు చేసారు. ప్రస్తుతం తమిళ రీమేక్ గబ్బర్ లో బిజీగా ఉన్నారు. గబ్బర్ చిత్రం తమిళ చిత్రం రమణ కు రీమేక్. రమణ చిత్రం తెలుగులో ఠాగూర్ గా వచ్చి హిట్టైంది. అక్షయకుమార్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.