Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
దర్బార్ నష్టాలు.. కనికరించాలని డిస్ట్రిబ్యూటర్ల వినతి
సంక్రాంతి బరిలోకి దర్బార్ సినిమాతో దిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ భారీ వసూళ్లనే రాబట్టాడు. విలక్షణ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, రజినీకాంత్ మొట్టమొదటి కాంబినేషన్ కావడం, టీజర్, ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. అనుకున్న దానికంటే ఎక్కువగానే బిజినెస్ చేసి మరోసారి తలైవా స్టామినాను నిరూపించింది.
కెరీర్లో ఫస్ట్ టైమ్..
రజనీ-మురుగదాస్ కాంబినేషన్లో దర్బార్ సినిమా రాబోతోందనగానే.. తమిళ నాటే కాదు అన్ని భాషల ఇండస్ట్రీల్లోనూ అంచనాలు పెరిగాయి. ముంబై బ్యాక్ డ్రాప్, కెరీర్లో ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్గా రజినీ నటించడం వంటి అంశాలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి.
ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డు..
రజినీ సినిమా అంటే కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. వివిద దేశాలు దాటి ఖండాంతర వరకు దాని హవా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసిన దర్బార్ మొదటి రోజే దాదాపు వంద కోట్ల గ్రాస్ను రాబట్టినట్టు ట్రేడ్ పండితులు ప్రకటించారు. ఇలా ఫస్ట్ డే కలెక్షన్లలో రజినీ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నాడు.
మొత్తంగా 250కోట్ల గ్రాస్..
తమిళ నాట దర్బార్కు పోటీ లేకపోవడం కలిసి వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు, అల వైకుంఠపురములో రెండూ పోటా పోటీగా ఉండటంతో అంతగా కలిసి రాలేదు. ఇప్పటికీ ఈ చిత్రం కొన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250కోట్ల గ్రాస్ను రాబట్టినట్టు సమాచారం. అయితే లెక్కలు మాత్రం ఇలా ఉంటే రియాల్టీలో పరిస్థితి వేరేలా ఉంది.
రజినీ ఆదుకోవాలి..
దర్బార్
చిత్రాన్ని
తమిళనాడు
డిస్ట్రిబ్యూటర్లకు
మాత్రం
నష్టాలనే
మిగిల్చిందట.
అయితే
తెలుగు
రాష్ట్రాల
వరకు
దర్బార్కు
ఎలాంటి
నష్టాలు
వాటిల్లలేదని
తెలుస్తోంది.
మిగతా
ఏరియాల్లో
భారీ
రేటుకే
దర్బార్
అమ్ముడు
పోయింది.
ఎంతో
కొంత
పరిహారం
ఇప్పించాలని
కోరుతూ
రజనీని
కలవాలని
పంపిణీదారులు
ఎదురు
చూస్తున్నారన్న
వార్తలు
కోలీవుడ్
లో
చక్కర్లు
కొడుతున్నాయి.