Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దర్బార్ నష్టాలు.. కనికరించాలని డిస్ట్రిబ్యూటర్ల వినతి
సంక్రాంతి బరిలోకి దర్బార్ సినిమాతో దిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ భారీ వసూళ్లనే రాబట్టాడు. విలక్షణ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, రజినీకాంత్ మొట్టమొదటి కాంబినేషన్ కావడం, టీజర్, ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. అనుకున్న దానికంటే ఎక్కువగానే బిజినెస్ చేసి మరోసారి తలైవా స్టామినాను నిరూపించింది.
కెరీర్లో ఫస్ట్ టైమ్..
రజనీ-మురుగదాస్ కాంబినేషన్లో దర్బార్ సినిమా రాబోతోందనగానే.. తమిళ నాటే కాదు అన్ని భాషల ఇండస్ట్రీల్లోనూ అంచనాలు పెరిగాయి. ముంబై బ్యాక్ డ్రాప్, కెరీర్లో ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్గా రజినీ నటించడం వంటి అంశాలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి.
ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డు..
రజినీ సినిమా అంటే కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. వివిద దేశాలు దాటి ఖండాంతర వరకు దాని హవా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసిన దర్బార్ మొదటి రోజే దాదాపు వంద కోట్ల గ్రాస్ను రాబట్టినట్టు ట్రేడ్ పండితులు ప్రకటించారు. ఇలా ఫస్ట్ డే కలెక్షన్లలో రజినీ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నాడు.
మొత్తంగా 250కోట్ల గ్రాస్..
తమిళ నాట దర్బార్కు పోటీ లేకపోవడం కలిసి వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు, అల వైకుంఠపురములో రెండూ పోటా పోటీగా ఉండటంతో అంతగా కలిసి రాలేదు. ఇప్పటికీ ఈ చిత్రం కొన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250కోట్ల గ్రాస్ను రాబట్టినట్టు సమాచారం. అయితే లెక్కలు మాత్రం ఇలా ఉంటే రియాల్టీలో పరిస్థితి వేరేలా ఉంది.
రజినీ ఆదుకోవాలి..
దర్బార్
చిత్రాన్ని
తమిళనాడు
డిస్ట్రిబ్యూటర్లకు
మాత్రం
నష్టాలనే
మిగిల్చిందట.
అయితే
తెలుగు
రాష్ట్రాల
వరకు
దర్బార్కు
ఎలాంటి
నష్టాలు
వాటిల్లలేదని
తెలుస్తోంది.
మిగతా
ఏరియాల్లో
భారీ
రేటుకే
దర్బార్
అమ్ముడు
పోయింది.
ఎంతో
కొంత
పరిహారం
ఇప్పించాలని
కోరుతూ
రజనీని
కలవాలని
పంపిణీదారులు
ఎదురు
చూస్తున్నారన్న
వార్తలు
కోలీవుడ్
లో
చక్కర్లు
కొడుతున్నాయి.