Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘రక్త చరిత్ర పార్ట్2’ తర్వాత మద్దెలచెరువు సూరి ఇంటికి గజని సూర్య..!?
రక్త చరిత్ర సినిమా ఎంతటి సంచలనం సష్టించిందో అందరికి తెలిసిందే. వివాదాలకు కేంద్రబిందువుగా మారిన చిత్రం 'రక్తచరిత్ర'. రామ్ గోపాల్ వర్మ ఈ కథని రెండు భాగాలుగా చిత్రించారు. వివేక్ ఒబెరాయ్, సూర్య ప్రధాన పాత్రధారులు. తొలి చిత్రం గత వారమే తెర మీదకు వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ ని పోలిన పాత్రను కించపరచేలా చూపించారనే వివాదం రావడంతో ఆ సన్నివేశాల్ని తొలగిస్తున్నట్లు సమర్పకుడు సి.కల్యాణ్ ప్రకటించారు.
'రక్త చరిత్ర 2'ని వచ్చే నెల 19న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ భాగంలో సూర్య పాత్ర ప్రవేశిస్తుంది. మొదటి భాగంలో నరసింహారెడ్డిని ప్రతాప్ రవి (వివేక్) హత్య చేస్తాడు. తదనంతరం నాయకుడిగా ఎదుగుతాడు. ఇందులో నరసింహారెడ్డి కుమారుడు ఇంకా రాలేదు. ద్వితీయ భాగంలో అతని పాత్ర ఉంటుంది. ఆ పాత్రలోనే తమిళ హీరో (గజిని) సూర్య నటించారు. అతని భార్యగా ప్రియమణి కనిపిస్తుంది. రక్తచరిత్ర పార్ట్ 2 విడుదల తర్వాత హీరో సూర్య మద్దెల చెరువు సూరి ఇంటికి వెళ్ళి భోజనం చేయనున్నారు. రక్త చరిత్ర పార్ట్ 1 విడుదల అనంతరం పరిటాల రవి పాత్రను పోషించిన వివేక్ ఒబెరాయ్ పరిటాల సునీత ఇంటికి వెళ్ళి బోజనం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా రక్త చరిత్ర పార్ట్ 2 విడుదల అనంతరం హీరో సూర్య మద్దెల చెరువు సూరి ఇంటికి వెళ్ళి భోజనం చేయనున్నారా..