twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రక్త చరిత్ర పార్ట్2’ తర్వాత మద్దెలచెరువు సూరి ఇంటికి గజని సూర్య..!?

    By Sindhu
    |

    రక్త చరిత్ర సినిమా ఎంతటి సంచలనం సష్టించిందో అందరికి తెలిసిందే. వివాదాలకు కేంద్రబిందువుగా మారిన చిత్రం 'రక్తచరిత్ర'. రామ్‌ గోపాల్‌ వర్మ ఈ కథని రెండు భాగాలుగా చిత్రించారు. వివేక్‌ ఒబెరాయ్‌, సూర్య ప్రధాన పాత్రధారులు. తొలి చిత్రం గత వారమే తెర మీదకు వచ్చింది. ఇందులో ఎన్టీఆర్‌ ని పోలిన పాత్రను కించపరచేలా చూపించారనే వివాదం రావడంతో ఆ సన్నివేశాల్ని తొలగిస్తున్నట్లు సమర్పకుడు సి.కల్యాణ్‌ ప్రకటించారు.

    'రక్త చరిత్ర 2'ని వచ్చే నెల 19న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ భాగంలో సూర్య పాత్ర ప్రవేశిస్తుంది. మొదటి భాగంలో నరసింహారెడ్డిని ప్రతాప్‌ రవి (వివేక్‌) హత్య చేస్తాడు. తదనంతరం నాయకుడిగా ఎదుగుతాడు. ఇందులో నరసింహారెడ్డి కుమారుడు ఇంకా రాలేదు. ద్వితీయ భాగంలో అతని పాత్ర ఉంటుంది. ఆ పాత్రలోనే తమిళ హీరో (గజిని) సూర్య నటించారు. అతని భార్యగా ప్రియమణి కనిపిస్తుంది. రక్తచరిత్ర పార్ట్ 2 విడుదల తర్వాత హీరో సూర్య మద్దెల చెరువు సూరి ఇంటికి వెళ్ళి భోజనం చేయనున్నారు. రక్త చరిత్ర పార్ట్ 1 విడుదల అనంతరం పరిటాల రవి పాత్రను పోషించిన వివేక్ ఒబెరాయ్ పరిటాల సునీత ఇంటికి వెళ్ళి బోజనం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా రక్త చరిత్ర పార్ట్ 2 విడుదల అనంతరం హీరో సూర్య మద్దెల చెరువు సూరి ఇంటికి వెళ్ళి భోజనం చేయనున్నారా..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X