Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
‘రూలర్’ టైటిల్తో ఈసారి బోయపాటి...
ఇండస్ట్రీలో నెం.1 స్థానానికి ఎదగాలంటూ ముందు మాస్ ప్రేక్షకుల మెప్పించాలి. దీంతో ఆ కోవకి చెందిన దర్శకులతో చేయడానికి చెర్రీ ఇంట్రస్టు చూపుతున్నాడు.రామ్ చరణ్ కి దర్శకుడు బోయపాటి చెప్పిన కథ చాలా బాగా నచ్చిందనీ, తన అంగీకారాన్ని కూడా తెలియజేశాడని సమాచారం. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించనున్నారు.
దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ ఈ విషయమై అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ... మేము రెండు భారీ చిత్రాలతో వస్తున్నాము. త్వరలోనే ఇవి సెట్స్ కు వెళ్లనున్నాయి. అవి... మహేష్-రాజమౌళి కాంబినేషన్ చిత్రం, బోయపాటి శ్రీను-రామ్ చరణ్ చిత్రం. ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయనున్నాం. వాటి వివరాలు తర్వాత ప్రకటిస్తాం అన్నారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై గతంలో క్షణ క్షణం, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, హలో బ్రదర్, సంతోషం, వంటి చిత్రాలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి. ఎన్టీఆర్ తో రాఖీ చిత్రం చేసిన తర్వాత వారు గ్యాప్ ఇచ్చారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం యావరేజ్ అయ్యింది. ఆ తర్వాత వారు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ భారీ కాంబినేషన్ చిత్రాలు ప్రకటించారు.