చిరంజీవి, కొరటాల సినిమా.. రంగస్థలం ఫ్లేవర్!
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా పరాజయమే లేకుండా దూసుకుపోతున్నారు దర్శకుడు కొరటాల శివ. ఇటీవల ఆయన తెరకెక్కించిన భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం సాధించింది. కొరటాల శివ తదుపరి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సైరా తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం అని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి డ్యూయెల్ రోల్ లో కొరటాల శివ కథ కూడా సిద్ధం చేశాడని టాక్. చిరంజీవి ఈ చిత్రంలో రైతుగా, బిలినియర్ గా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెం 150 చిత్రాన్ని స్వయంగా రాంచరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైరా చిత్రానికి కూడా రాంచరణే నిర్మాత.

తన తండ్రికి నిర్మాత కావడం చరణ్ కు చాలా బావుందేమో.. అందుకే కొరటాల రూపొందించబోయే చిత్రంలోను చరణ్ ఓ చేయి వేయబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ తో కలసి రాంచరణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తారట. మైత్రి మూవీస్ నిర్మణంలో ఇటీవలే రాంచరణ్ రంగస్థలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











