Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
రామ్ చరణ్ ఫిక్స్.. ఏప్రిల్ నెలలో!
మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ జర్నీలో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది. గత సినిమా 'సైరా నరసింహా రెడ్డి' జోష్ కంటిన్యూ చేస్తూ మెగా 152 సెట్స్ పైకి చేరారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. చిరంజీవి తప్ప ఇంకా మిగితా తారాగణం అఫీషియల్గా ప్రకటించనప్పటికీ రకరకాల రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో చిరంజీవి సరసన త్రిష కన్ఫర్మ్ అయినట్లుగా, అదేవిధంగా రామ్ చరణ్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు విన్నాం. అయితే అదే బాటలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమా కోసం 15 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట రామ్ చరణ్. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్లో చెర్రీ భాగం కానున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కొరటాల శివ రంగం సిద్ధం చేస్తున్నారట.
దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల రానుందని అంటున్నారు. అదేవిధంగా చిత్రంలో నక్సలిజం బ్యాక్డ్రాప్ కూడా కనిపిస్తుందని టాక్. సామాజిక అంశాలను ఎలివేట్ చేస్తూ సినిమాలు రూపొందించే సత్తా ఉన్న దర్శకుడు ఈ సినిమా కోసం కూడా బలమైన కథ రాసుకున్నారట.
అందుకే కాస్త లేటైనప్పటికీ ఓపికగా ఆ కథకు మరిన్ని మెరుగులు దిద్దారట. ఇక చిరంజీవి- కొరటాల కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం జనాలు చూస్తున్న ఎదురుచూపులను వర్ణించలేం!.