Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చిత్రం డైనమిక్ డైరక్టర్ దర్శకత్వంలో...!
రాజమౌళి చిత్రం అంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్సడింది..తాజాగా రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రం చేయడానికి కథ సిద్దం చేసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..ఇప్పటి వరకు ఒక్క హీరోని పెట్టి రికార్డులను తిరగరాస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న డైనమిక్ డైరక్టర్ రాజమౌళి మల్టీస్టారర్స్ గా ఎవరిని తీసుకుంటున్నాడో తెలుసా? యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని తెలిసి కూడా రాజమౌళి సాహసం చేయడానికి సిద్దం అవుతున్నాడంటే నిజంగా అతని ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాలి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మంచి మాస్ ఇమేజ్ ఉంది. చిరుత రామ్ చరణ్ తేజ్ కూడా 'మగధీర" తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే మంచి మాస్ మూవీ వస్తుందని పరిశ్రమ వార్గాలలోనూ అనుకుంటున్నారు. కానీ ఈ ఇద్దరి మాస్ హీరోలను డీల్ చేయగల సత్తా ఎవరికి ఉంది? అనే చర్చ వచ్చింది చాలా మంది రాజమౌళికే ఓటు వేశారు. రాజమౌళి కూడా ఈ ఇద్దరి హీరోలను దృష్టిలో పెట్టుకుని కథ సిద్దం చేస్తున్నాడని సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే టైగర్ ని, చిరుతని ఎలా చూపిస్తాడా వేచి చూడాల్పిందే.