Don't Miss!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ చరణ్ ఓకే చెప్తున్న రీమేక్...దాని కథ
హైదరాబాద్ : కృష్ణవంశీ తో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే' తర్వాత రామ్ చరణ్ ఏ చిత్రమూ కూడా సైన్ చేయలేదు. శ్రీను వైట్లతో అనుకున్న చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు. కోన వెంకట్,గోపీ మోహన్ తయారు చేసిన స్క్రిప్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ డైరక్టర్ ని ఫైనలైజ్ చేయలేదు. గౌతమ్ మీనన్ తో చిత్రం అనుకున్నారు కానీ అది ఆయన అజిత్ చిత్రం పూర్తయ్యే దాకా ప్రారంభించరు. దాంతో ఇప్పుడు మరో కన్నడ రీమేక్ పై రామ్ చరణ్ కన్నేసినట్లు సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే..
‘గోవిందుడు అందరివాడేలే' తర్వాత ఇప్పటికే పలువురి దర్శకులతో కథాచర్చల్లో పాల్గొన్న చరణ్ దేనిపైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. గోవిందుడు కూడా అనుకున్న ఫలితం ఇవ్వకపోవటంతో ఓ రీమేక్పై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. కన్నడంలో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన ‘బహద్దూర్' చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ధ్రువ్ సర్జా, రాధకా పండిట్ జంటగా నటించిన ఈ చిత్రానికి చేతన్కుమార్ దర్శకత్వం వహించారు. పక్కా మాస్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ బాక్సాఫీస్ను సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను ఇటీవలే చూసిన రామ్చరణ్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. . ఈ సినిమాకు సంబంధించిన హక్కులకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ చిత్రం కథేమిటంటే..
ఓ పెద్ద బహుదూర్ వంశానికి చెందిన హీరో అశోక్(ధ్రువ సర్జా) చుట్టూ కథ తిరిగుతుంది. అతను మైసూర్ వచ్చి తన ఐడింటిటీ దాచిపెట్టి తనెవరో చెప్పకుండా తనకు తగ్గ అమ్మాయిని వెతుకుతూంటారు. అప్పుడు అతనికో అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె అంజలి(రాధికాపండిట్). ఆమె తన తండ్రికి మాట ఇచ్చి ఉంటుంది. చదువు పూర్తైన తర్వాత ఎవరిని చూపెడితే వారినే పెళ్లి చేసుకుంటానని. ఈ విషయం తెలియని అశోక్ ఆమెతో ప్రేమలో పడి..ఆమె వెనక పడి, అల్లరి చేసి, చివరికి ఆమె చేత ఓకే చేయించుకుంటాడు.
ఈ లోగా ఆమెకు ఇంటి నుంచి కబురు వస్తుంది. ఇంటికి వెళ్లగానే తండ్రి ఆమెతో..నీకు నా ఆత్మీయ స్నేహితుడు అప్పాజీ కుమారుడు శంకర్ తో పెళ్లి నిశ్చయం చేసానని చెప్పి, ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేసేస్తాడు. తండ్రికి ఇచ్చిన మాట కాదనలేని అంజలి....ఇటు ఈ విషయం తెలుసుకున్న అశోక్ ఏం చేసారు. వారిద్దరి వివాహం ఎలా జరిగింది. ఈ కథలో అప్పాజీ గౌడ ఏం విలనీ చేసి, ఈ ప్రేమకుల మధ్య ఎడబాటు సృష్టించాడు వంటి ఆసక్తికరమైన అంశాలతో కథ నడుస్తుంది.