twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే రామ్ చరణ్ 'మెరుపు' షూటింగ్ ఆగింది!!

    By Srikanya
    |

    రామ్ చరణ్ తాజా చిత్రం 'మెరుపు' చెన్నైలో షూటింగ్ ప్లాన్ చేసారు. అయితే రెండు రోజులుగా షూటింగ్ అగినట్లు సమాచారం. కారణం మరేదీ కాదని వర్షాలు అని చెప్తున్నారు. ఈ చిత్రం కోసం చెన్నైలోని బిన్ని మిల్స్ లో ధరణి ఇంట్రడక్షన్ సీన్స్ ప్లాన్ చేసారు. అందుకోసం ధరణి..ఆర్ట్ డైరక్టర్ ని ఓ కాలని సెట్ వేయమని పురమాయించారు. అయితే వర్షం కారణంగా ఆ పని మధ్యలోనే ఆగిపోవటంతో వాయిదా వేసారని చెప్తున్నారు. దాంతో మిగతా ఇంపార్టెంట్ సీన్స్ తీస్తున్నట్లు చెప్తున్నారు. జూన్ 18 నుంచి ఈ ఇంట్రడక్షన్ సీన్స్ తీస్తారని యూనిట్ వర్గాలు అంటున్నారు. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి డిసెంబర్ నెలకల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ధరణి తనను కలిసి మీడియాతో చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. మగధీర తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవటంతో మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ పై ఈ చిత్రం రూపొందుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X