Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
రామ్ చరణ్ నిర్మాతకు రూ. 3 కోట్లు తిరిగిచ్చాడట?
హైదరాబాద్: ‘గోవిందుడు అందరి' వాడేలే చిత్రానకి సంబంధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ. 3 కోట్లు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు రూ. 40 కోట్ల షేర్ వసూలు చేసినప్పటికీ హెవీ బడ్జెట్ కారణంగా కొంత నష్టాలు వచ్చినట్లు టాక్. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరరెక్కిన ‘గోవిందుడు అందరి వాడేలే' తొలిరోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్గా నటించింది.
ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ చరణ్ నటించారు. కొన్ని కారణాల విడిపోయిన తన కుటుంబ సభ్యులను కలపడానికి హీరో ఏం చేసాడు? అనే పాయింటుతో సాగిన స్టోరీకి ఫ్యామిలీ అనుబంధాలు, ఆప్యాయతలు, ఎమోషన్స్, బావామరదళ్ల సరసాలు యాడ్ చేసి వినోదాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణ వంశీ.
ప్రకాష్ రాజ్, జయసుధ, రహహాన్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్శంకర్రాజా, ఆర్ట్: అశోక్కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ, నిర్మాత : బండ్ల గణేష్.