Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ ‘జాన్’ మూవీ ఆలస్యానికి రామ్ చరణే కారణం.. ఆ సలహా వల్లే ఈ పరిస్థితి.!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్తో దేశ వ్యాప్తంగా స్టార్డమ్ దక్కించుకున్న హీరో. ఈ మూవీ అతడి కెరీర్ను ఒక్కసారిగా మార్చేసింది. అప్పటి వరకు మామూలు సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఈ స్టార్ హీరో.. బాహుబలి తర్వాత మాత్రం బడా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే 'సాహో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని తర్వాత ప్రభాస్ ప్రస్తుతం 'జాన్' అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఎన్నో అంచనాలతో వచ్చి.. చివరకు ఇలా
ప్రభాస్ ఇటీవల ‘సాహో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సుజిత్ తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో వచ్చి.. వాటిని అందుకోలేకపోయింది. దాదాపు రూ. 350 కోట్లతో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాలనే మిగిల్చింది. అయితే, ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది.
మరో సరికొత్త యాంగిల్ చూపిస్తాడట
భారీ స్టైలిష్ మూవీ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ నటిస్తున్న చిత్రం ‘జాన్'. ‘జిల్' ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ యాంగిల్ను చూపించబోతున్నారట. 1960వ దశకం నాటి కథతో వస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.
బాహుబలి తర్వాత మరోసారి ఆ ప్రయోగం
లవ్ స్టోరీ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ‘జాన్'లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అది కూడా తండ్రి కొడుకుల రోల్స్ అని అంటున్నారు. గతంలో ‘బాహుబలి' సినిమాలోనూ ప్రభాస్ ఇలా ద్విపాత్రాభినయం చేశాడు. మరోవైపు, ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో రాబోతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆగిన సినిమా
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘జాన్' సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. దీని రెండో షెడ్యూల్ కూడా ఈ పాటికే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లాడు. అందుకే ఈ సినిమా షూటింగ్ సెకెండ్ షెడ్యూల్ ఇంకా స్టార్ట్ కాలేదని అంటున్నారు.
రామ్ చరణ్ ఇచ్చిన సలహానే కారణం
జాన్ మూవీ ఆలస్యానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణే కారణం అంటూ తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం భారీ సెట్ నిర్మించాల్సి ఉందట. అది రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేయాలి. కానీ, రామ్ చరణ్ ఎక్కడైన ప్రైవేటు ప్లేస్లో అయితే బాగుంటుందని నిర్మాతలకు సలహా ఇవ్వడంతో దాన్ని మార్చారని అంటున్నారు.
అప్పుడు అలాగే చేశాడని చెప్పడంతో
ఇటీవల రామ్ చరణ్.. చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి'కి నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనూ ప్రైవేటు స్థలంలోనే సెట్లు వేశారు. ఈ విషయాన్ని ‘జాన్' నిర్మాతలకు చెప్పడంతో వారు.. తెల్లాపూర్ దగ్గర మూడు ఎకరాల స్థలం లీజుకు తీసుకుని భారీ సెట్లు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.