Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
దర్శకునికి చుక్కలు చూపిస్తున్న రామ్ చరణ్...
'ఆరెంజ్ అట్టర్ ప్లాప్ అయ్యేసరికి రామ్ చరణ్ డైలమాలో పడ్డటున్నాడు..మరీ మగధీరగా ఆడకపోయినా కనీసం యావరేజ్ అయినా అనిపించుకుంటుందని అనుకుంటే 'ఆరెంజ్" ఏకంగా కుళ్లిపోయింది. దాంతో తదుపరి చిత్రంతో డీసెంట్ హిట్ అయినా ఇవ్వాల్సిన భారం చరణ్ పై పడింది. లేదంటే మగధీర రాజమౌళి ఘనత అని, చరణ్ కి అంత సీన్ లేదని మీడియా ఈజీగా కల్సితాలు కల్పించేస్తుంది. అందుకే ఆల్రెడీ కమిట్ అయిన 'మెరుపు" సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి చరణ్ తాత్సారం చేస్తున్నాడు.
ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రంపై చరణ్ కి నమ్మకం కుదరక పక్కకి పెట్టాడు. అయితే దానిని పూర్తి చేయడం తప్పదు కాబట్టి ఆ చిత్ర దర్శకుడు ధరణిని అదే పనిగా సతాయిస్తున్నాడు. సబ్జెక్ట్ విషయంలో పూర్తి భరోసా వచ్చాకే మళ్లీ షూటింగ్ కి వెళదామని, అవసరమైతే ఒకే షెడ్యూల్ లో ఏకధాటిగా షూటింగ్ పూర్తి చేసుకుందాం కానీ సెట్స్ మీదకి వెళ్లాక మాత్రం మళ్లీ ఆలోచనలో పడొద్దని చరణ్ ధరణికి చెప్పేశాడట. తమిళంలో వరుస ప్లాపులతో డీలా పడ్డ ధరణి తెలుగులో ఈ సినిమాతో హిట్టిచ్చి తన సత్తా చాటుకుందామని ఉవ్విళ్లూరుతున్నాడు. కానీ కాన్ఫిడెన్స్ కోల్పోయిన చరణ్ అతడిని క్లారిటీ పేరుతో పీడించేస్తున్నాడు.