twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెరుపు కథ గురించి రామ్ చరణ్ ట్విట్టర్ పలుకులు

    By Srikanya
    |

    రామ్ చరణ్ తాజా చిత్రం మెరుపు స్క్రిప్టు సమస్యని ఎదుర్కోంటందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ...హాయ్ ఎవరి వన్...రెండు మూడు రోజుల్లో స్ట్రైక్ కాల్ ఆఫ్ అవుతుందని విన్నాను. నాకు చాలా ఆనందమేసింది. నా మెరుపు షూటింగ్ ని వెంటనే ప్రారంభించేస్తాను. మెరుపు కథ ఫైనలైజ్ అయ్యింది. చాలా గొప్పగా వచ్చింది. బాగా ఎంటర్టైనింగ్ గా సాగే కమర్షియల్ మూవిగా తయారైంది. షూటింగ్ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నాను అన్నారు. ఇక మెరుపు చిత్రం కథపై గత నెల రోజులుగా చెన్నైలో దర్శకుడు ధరణి తన టీమ్ తోనూ, ఇక్కడ లోకల్ గా హైదరాబాద్ లో పరుచూరి బ్రదర్స్ కుస్తీ పడుతున్నట్లు సమాచారం. మొదటి అనుకున్న పాయింట్ తో సరైన సీన్స్ రాకపోయినా యాక్షన్ పార్ట్ బాగుందని రామ్ చరణ్ ఒప్పుకోవటం జరిగింది. అయితే ఆరెంజ్ చిత్రం కథా ఫెయిల్యూర్ కావటంతో వెంటనే ఈ చిత్రం కథకు రిపేర్లు ప్రారంభించారు. అయితే ఇవి దర్శకుడు ధరణికి ఇష్టం లేకపోయినా తప్పదని కొనసాగిస్తున్నట్లుతెలుస్తోంది. మరో ప్రక్క పరుచూరి సోదరులు కూడా ఈ కథపై రకరకాల ప్రశ్నలు వేసి హీరోని తద్వారా దర్శకుడుని ఇరుకున పెడుతున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క హీరోయిన్ కాజల్ కూడా తను డేట్స్ కేటాయించలేనంటూ తప్పుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X