Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
RC15: రామ్ చరణ్ కోసం పవర్ఫుల్ విలన్.. శంకర్ మళ్ళీ అదే ప్లాన్?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా అనంతరం వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైవ్ లో పెడుతూ ఉన్నాడు. ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ ని అందుకుంటుందో తెలియదుగానీ తదుపరి సినిమాలతో మాత్రం ఎలాగైనా సోలోగా పాన్ ఇండియా మార్కెట్ సెట్ చేసుకోవాలని రామ్ చరణ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న RRR సినిమా మొత్తానికి విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించాడు.
తప్పకుండా RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక స్పెషల్ మార్కెట్ అయితే క్రియేట్ చేస్తోంది అని రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే వారు తదుపరి సినిమాలను భారీ స్థాయిలో ఉండేలా పాన్ ఇండియా ప్రాజెక్టులుగా మలుచుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ తేజ్ మొదటి సారి తమిళ దర్శకుడు శంకర్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ దర్శకుడు కూడా ఎప్పటినుంచో తెలుగు హీరోతో సినిమా చేయాలని చూస్తున్నారు. మొదట మెగాస్టార్ చిరంజీవితో అనుకున్నప్పటికీ సెట్టవ్వలేదు. ఆ తర్వాత మహేష్ బాబుతో కూడా అప్పట్లో చర్చలు జరిపారు కానీ అది కూడా వర్కౌట్బ్ కాలేదు.
ఇక ఫైనల్ గా రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న RC 15 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే రామ్ చరణ్ తేజ్ కు విలన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే దర్శకుడు శంకర్ మెయిన్ విలన్ గా ఒక మలయాళం నటుడిని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నలుగురు విలన్స్ ఉంటారట. ఇక ప్రధాన విలన్ మాత్రం ఫుల్ గా ఉండాలి అని దర్శకులు చాలామందిని ఆడిషన్ చేశాడట. అయితే ఎవరు కూడా అంతగా నచ్చకపోవడంతో ఫైనల్ గా మలయాళం స్టార్ యాక్టర్ సురేష్ గోపీ ని సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఈ నటుడు శంకర్ తెరకెక్కించిన 'ఐ' సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అమాయకమైన డాక్టర్ గా కనిపిస్తూనే భయంకరమైన విలనిజం చూపించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ నటుడిగా అయితే సురేష్ గోపికి మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు మళ్లీ అదే నటుడికి రామ్ చరణ్ కు మెయిన్ విలన్ గా సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ విషయంపై అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ త్వరలోనే పూర్తిగా నటీనటుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని శంకర్ ఆలోచిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మార్కెట్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా సినిమాకు 150 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇటీవల మొదలైన ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది అక్టోబర్ లోగా పూర్తి చేసి 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు.